దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ నటించిన తాజా సినిమా ‘ఆలంబన’. పార్వతి నాయర్ కథానాయికగా నటింగా, మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. పారి కె విజరు దర్శకుడు. కోటపాడి రాజేష్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. డిసెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ‘హీరో అపర కుబేరుల ఇంట్లో జన్మిస్తాడు. కానీ, దురదష్టవశాత్తు వాళ్ళ కుటుంబం ఆస్తి మొత్తాన్ని కోల్పోతుంది. అటువంటి పరిస్థితులో ఓ శుభ ముహూర్తంలో హీరో జీవితంలోకి జీని అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది వెండితెరపై చూడాలి. ‘ప్రేక్షకులకు వినోదం అందించే చిత్రమిది. హీరోకి, వాళ్ళ కుటుంబానికి ఎదురయ్యే పరిస్థితులు కడుపుబ్బా నవ్విస్తాయి’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.