రామ్‌ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ

రామ్‌ సినిమాతో తెలుగులోకి ఎంట్రీతెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రతిభా వంతులను పరిచయం చేసే విషయంలో హీరో రామ్‌ పోతినేని ఎప్పుడూ ముందుం టారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా అంతే. ప్రతిభకు పట్టం కడుతూ కొత్తవారికి స్వాగతం పలుకుతుంది. రామ్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై మహేష్‌ బాబు పి దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్న సినిమాతో తెలుగు పరిశ్రమకు కొత్త సంగీత దర్శకులను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్‌ సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ వివేక్‌ – మెర్విన్‌ సంగీతం అందించనున్నట్లు ఆదివారం తెలిపారు.ఈ సంచలన సంగీత ద్వయానికి రామ్‌ సోషల్‌ మీడియా ద్వారా స్వాగతం పలికారు. ‘తెలుగు తెరపై సరికొత్త సంగీత సంచలనానికి స్వాగతం’ అని రామ్‌ ట్వీట్‌ చేశారు. వివేక్‌ శివ, మెర్విన్‌ సాల్మన్‌… ఇద్దరూ కలిసి వివేక్‌ – మెర్విన్‌ పేరుతో మ్యూజిక్‌ చేయడం మొదలు పెట్టారు. తమిళంలో తొలి సినిమా ‘వడా కర్రీ’తో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వాళ్లిద్దరూ సంగీతం అందించిన ప్రైవేట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ సాంగ్‌ ‘ఓర్శాడా…’, ‘పక్కం నీయుమ్‌ ఇళ్లై…’ చార్ట్‌ బస్టర్లుగా నిలిచాయి.ధనుష్‌ హీరోగా నటించిన ‘పటాస్‌’ చిత్రానికి సంగీతం అందించారు. ఆ సినిమాలోని ‘చిల్‌ బ్రో…’ సాంగ్‌, ఇంకా ప్రభుదేవా ‘గులేబకావళి’లోని గులేబా సాంగ్‌, కార్తీ ‘సుల్తాన్‌’ సినిమాలోని సాంగ్స్‌… ఇలా వివేక్‌ – మెర్విన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ పాటలకు మ్యూజిక్‌ అందించారు. ఇప్పుడీ సంగీత ద్వయాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు రామ్‌, దర్శకుడు మహేష్‌ బాబు పి. ఈ సినిమాలో రామ్‌ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.