
ఏ వ్యక్తి అయినా రూ.50,000 (యాభై వేల రూపాయలు) కంటే ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో ఎటువంటి ఆధారాలు లేకుండా వాహనాలలో తరలించినా లేదా కలిగి ఉన్నట్లయితే అట్టి నగదును జప్తు చేస్తారని ఇట్టి విషయంపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించ వలసినదిగా పోలీసు నోడల్ అధికారి ఎన్.వెంకటేష్ తెలిపారు. పోలీసు శాఖాధికారులు, రెవిన్యూ అధికారులు,ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియపరచనైనది.ఈ కార్యక్రమంలో నియోజవర్గం లోని తహశీల్దార్ లు,ఎం.పి.డి.ఒ లు,నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులు.ఎన్నికల విధులు నిర్వహించు బృందాలు పాల్గొన్నారు.