– రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ: మల్హర్ రావు.
ప్రపంచ మేధావి,రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో వారి ప్రావిణ్యతను పెంచడం కోసం ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.ఎన్నికల నియమావళి అనుసరించి ఆలస్యం జరుగుతున్నదన్నారు. హైదరాబాద్ నుండి ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లకు వీడియోలు, ఆడియోల ద్వారా కోచింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరున విద్యను అందించాలనే ఆలోచన మేరకు ఈ నాలెడ్జ్ సెంటర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని వారికి అనుగుణంగా మార్చాలనే ఆలోచన చేస్తున్నాయన్నారు.గత పది సంవత్సరాలపాటు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.రాజ్యాంగ స్ఫూర్తితో,అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని పేర్కోన్నారు.రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్రంలో నవసమాజం, సమానత్వంతో పరిపాలనలో పూర్తిస్థాయిలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు