అంగవైకల్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

– వికలాంగులు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
– ఎన్.పి.ఆర్.డి క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన జిల్లా సంక్షేమ అధికారిని అన్నపూర్ణ
నవతెలంగాణ – భువనగిరి
సమాజంలో ప్రతి ఒక్కరు అంగవైలక్యం పట్ల అవగాహనా కలిగి ఉండాలని, వికలాంగుల సంక్షేమo కోసం ప్రభుత్వలు  అమలు చేస్తున్న పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని అన్నపూర్ణ  అన్నారు.  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక 2024 క్యాలెండర్ ను సమీకృత కలెక్టర్  కార్యాలయం ఆవరణలో వారు  ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలను  అమలు చేస్తున్నాయని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్నారు, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వికలాంగులను అవమాన పరిచే విధంగా మాట్లాడడం 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం నేరమని అన్నారు.అంగవైకల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని అనేక మంది నిరూపించారాని అన్నారు. వైఖల్యం ఉన్న పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు.వైఖల్యం కలిగిన పిల్లలు చదువుకునే విదంగా తల్లిదండ్రులు ప్రోత్సాహించాలని అన్నారు.వికలాంగుల కోసం ఉన్న చట్టాలు, జీవో ల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని అన్ని రంగాల్లో  ముందుకు వెళ్లాలని అన్నారు.జిల్లాలో ఉన్న వికలాంగులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 2024 నూతన సంవత్సరం క్యాలండర్ ను  ముద్రించడం అభినందననీయమని అన్నారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తినడం ద్వారా అంగవైకల్యాన్ని నిర్మూలించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురూపంగా ప్రకాష్, జిల్లా ప్రధాన  కార్యదర్శి వనం ఉపేందర్ మహిళా కన్వీనర్ కొత్త లలిత జిల్లా నాయకులు గోపి,కార్యాలయ సూపెరిండేంట్ శశికళ ,వెంకటేశ్వర్లు ,కిరణ్ మంజుల,కార్యాలయ సిబ్బంది మరియు వికలాంగులు పాల్గొన్నారు.