నవతెలంగాణ మల్హర్ రావు.
అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని మండల ఎంపిడిఓ శ్యాంసుందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక 2025 క్యాలెండర్ ను సూపర్ డెంట్ సత్యనారాయణ మూర్తితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం చట్టాన్ని ఆయుధంగా వినియోగించుకొని ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలనకు నడుం బిగించాలన్నారు.
అవినీతి అక్రమాలను ఎదుర్కొనేందుకు యువత, రైతులు, ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు నడవాలని, ఈ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆర్టీఐ యు.ఏప్ కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ మాట్లాడుతూ పాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారితనం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ ఎపిఓ హరీష్, సీనియర్ అసిస్టెంట్ మహేందర్, ఉపాది ఆపరేటర్ నాగరాజు, ఆర్టీఐ సభ్యుడు బూడిద రాజ సమ్మయ్య, ఎంపిడిఓ సిబ్బంది పాల్గొన్నారు.
అవినీతి అక్రమాలను ఎదుర్కొనేందుకు యువత, రైతులు, ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు నడవాలని, ఈ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆర్టీఐ యు.ఏప్ కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ మాట్లాడుతూ పాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారితనం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ ఎపిఓ హరీష్, సీనియర్ అసిస్టెంట్ మహేందర్, ఉపాది ఆపరేటర్ నాగరాజు, ఆర్టీఐ సభ్యుడు బూడిద రాజ సమ్మయ్య, ఎంపిడిఓ సిబ్బంది పాల్గొన్నారు.