నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని పెద్ద గుల్లా లోని తెలుగు, ఉర్దూ మీడీయం ఎపీయూపీఎస్, ఎంపిపీఎస్ లలో జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ మంగళ వారం నాడు పాఠశాలలోని ఏపీపి పనులు పరీశీలించడం జర్గంది . ఈ సంధర్భంగా ఎంపిడివో శ్రీనివాస్ మద్యహన బోజనం పరీశీలన చేసి విద్యార్థులకు బోజనంలో ఇంకా ఏమైన మార్పులు అవసరమా ? నిత్యం బాగవండుతున్నారా? విద్యర్థులకు అడిగి తెలుసు కున్నారు. పాఠశాలలో త్రాగు నీరు గురించి కొత్తగా ఏర్పాటు చేస్తున్న సింక్ లను, మరుగుదొడ్లు, వాష్ రూం, టాయిలెట్లు పరీశీలించి కొన్ని మార్పులు చేయాలని , పనులు నాణ్యతగా గుత్తేదారునితో దగ్గరుండి చేయించుకోవాలని హెచ్ఎం లను ఆదేశించారు. సమయ పాలన పాటించాలని లేకుంటే శాఖపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి, ఉర్దూ హెచ్ఎం సమీనా బేగం, తెలుగు మీడీయం ఇన్ చార్దీ హెచ్ఎం మనీషా, ఉపాద్యాయులు మౌనిక, తరన్నుమ్, శ్రీలత తదితరులు పాల్గోన్నారు.