– చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
– సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని,డబ్బులు వసూళ్లకు పాల్పడ్డ నకిలీ విలేఖర్లను అరెస్టు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విలేకరులమని చెప్పి లారీని అడ్డగించి లారీ ఓనర్ ను భయపెట్టి రూ.20వేలు వసూలు చేసిన ఐదుగురు వ్యక్తులపైన తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మార్చి 30న సాయంత్రం వేములవాడలోని వరలక్ష్మి రైస్ మిల్ నుండి 600 వడ్ల బస్తాలను తీసుకుని సిద్దిపేటకు వెళుతున్న లారీని జిల్లేల వరకు వెంబడించి, లారీని అడ్డగించి, డ్రైవర్ ద్వారా ఓనర్ వివరాలు తెలుసుకొని, ఓనర్ కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని లేనిచో సంబంధిత అధికారులకు చెప్పి వడ్లపై కేసు నమోదు చేపిస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. వేములవాడలో ఉన్న రైస్ మిల్లు యజమాని జిల్లెలకు రాగా అక్కడ ఉన్న ఐదుగురు నకిలీ విలేఖరులు పొన్నం చంద్రమౌళి,దూస రాజేందర్,చౌటపల్లి వెంకటేష్, అవునూరి ప్రశాంత్,నరేష్ లను కలవగా మేము విలేకరులము లారీ అక్రమంగా పోతుందని, మాకు డబ్బులు ఇవ్వాలని లేనిచో పై అధికారులకు చెప్తామని బెదిరించినట్లు తెలిపారు. వెంటనే యజమాని వద్ద నుండి రూ.20వేలు డిమాండ్ చేయడంతో సదర్ నకిలీ విలేకరులకు అందజేసినట్లు బాధితుడు వివరించినట్లు తెలిపారు. వెంటనే బాధితుడు తంగలపల్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నేరానికి పాల్పడిన వ్యక్తులు పరారి లో ఉండగా ఒక విలేకరి చంద్రమౌళిని అరెస్టు చేసి అతని వద్ద నుండి అక్రమంగా వసూలు చేసిన రూ.20 వేలు, ద్విచక్ర వాహనంతో పాటు సెల్ఫోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరానికి పాల్పడిన చంద్రమౌళిని ఆదివారం రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.పరారీలో ఉన్న మిగిలిన నిందుతులను కూడా అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు.ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.తంగలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారి వివరాలను 87126 56370కి లేదా డయల్ 100 కి కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.