బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం

– వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి
– చేరిన బొంపల్లి యువ నాయకులు
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని బొంపల్లిలో కాంగ్రెస్‌ యువ నాయకులు ప్రవీణ్‌ యాదవ్‌, కురువ శ్రీనివాస్‌ యాదవ్‌, మహేష్‌ యాదవ్‌, మంగలి ప్రవీణ్‌, వెంకటేశ్‌ యాదవ్‌, రాఘవేందర్‌ యాదవ్‌, మహేందర్‌ యాదవ్‌, విష్ణు యాదవ్‌, వేణు యాదవ్‌, కురువ నాని, మనీష్‌ తదితరులు శనివా రం బీఆర్‌ఎస్‌ పరిగి ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన యు వకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. బీఆర్‌ఎస్‌ పరిగి ఎమ్మెల్యే అభ్యర్ధి మ హేష్‌ రెడ్డి మాట్లాడుతూ..యువకులు బీఆర్‌ఎస్‌ బలోపేతానికి విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి, వైస్‌ ఎంపీపీ మల్లేశం, మండలాధ్యక్షులు గోపాల్‌ గౌడ్‌, మచ్చెందర్‌ రెడ్డి, బొంపల్లి ఎంపీటీసీ రాఘ వపురం రాములు, ఉపసర్పంచ్‌ రఫిక్‌ పాష, పవన్‌ యాదవ్‌,షేరాన్‌, షఫీ, వెంకటేష్‌, మోసిన్‌ రియా జ్‌, ముక్తార్‌, బండకింది రాఘవేందర్‌, మాజీ ఎంపీ టీసీ సంగయ్య యాదవ్‌, లోకేష్‌ యాదవ్‌, పట్నం శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.