నవతెలంగాణ – చండూరు
చండూరు మండలం లోని జోగిగూడెం గ్రామానికి చెందిన బేరే లింగయ్య (54) ఆకస్మాత్ గా బుధవారం మృతి చెందాడు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తోకల వెంకన్న కుటుంబాన్ని పరామర్శించి మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రూ.10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు.