నవతెలంగాణ-తొగుట: మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించామని ఎంపీటీసీ కొమ్ము శరత్,రైతూ బంధు మండల కన్వీనర్ బోదనం కనకయ్యలు అన్నారు. శుక్రవారం మండలంలోని ఘనపూర్ గ్రామానికి, నిరుపేద కుటుంబానికి చెందిన ఆకారం పోచవ్వ ఇటీవల అనా రోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వారికి 50 కిలో లు బియ్యం, రూ.5 వేలు ఆర్ధిక సహాయం అందిం చారు. మార్కెట్ కమిటీ సభ్యులు కొమ్మ కిషన్, మండల బీఆర్ఎస్ యువ జన ప్రధాన కార్యదర్శి కొమ్మ శేఖర్, బీఆర్ఎస్ బూత్ అధ్యక్షులు గణేష్, గౌడ సంఘం అధ్యక్షులు కనకయ్య, చందు, యువ కులు తదితరులు పాల్గొన్నారు.