విధి వంచిత బాల్యమిత్రునికి ఆర్థిక భరోసా

– ఆపదలో ఉన్న మిత్రునికి రూ.1.50 లక్షల సాయం
నవతెలంగాణ-కారేపల్లి
విధి వక్రీకరించి బాల్యమిత్రుని కుటుంబం ఆర్థికంగా చితికి పోయిన దశలో మేమున్నామంటూ తోటి స్నేహితులు అండగా నిలిచి రూ.1.50 లక్షలు ఆర్థిక సాయం చేశారు. కారేపల్లి హైస్కూల్‌లో 1991-92 సంవత్సర పదోతరగతి విద్యార్ధులు ప్రతి ఏటా సమ్మేళనంను నిర్వహించుకుంటారు. ఈ ఏడాది మే 28న పూర్వ విద్యార్ధుల సమ్మేళనం అనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సమయంలో తోటి మిత్రుడు ఖలీలుల్లాఖాన్‌ కుటుంబం అనారోగ్యంతో బాధపడుతుందని తెలుసుకున్నారు. ఖలిలూల్లాఖాన్‌ భార్య కిడ్ని వ్యాధితో బాధపడుతూ తప్పని సరిగా కిడ్ని మార్పి చేయాల్సిన పరిస్ధితి. కుమారుడు అఖిల్‌ ఆప్తమోలజిస్ట్‌ చదువుతున్నాడు. కుటుంబ పరిస్ధితిలో చదువు మధ్యలో ఆపివేశాడు. భార్య చికిత్స కోసం ఆటోను నమ్ముకోని జీవనం సాగిస్తున్నాడు. కిడ్ని దెబ్బతిన్న భార్యకు కిడ్నికి ఇచ్చి కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో విధి వక్రీకరించి ఖలీలుల్లాఖాన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బాల్య మిత్రుడు కుటుంబ బాధలు విన్న తోటి మిత్రులు కళ్లు చెమర్చాయి. వెంటనే అపదలో ఉన్న మిత్రునికి అండగా నిలవాలని తలంచారు. ఆర్ధిక సాయం చేసి ఆదర్శంగా నిలిచారు.
కోల్‌మైన్స్‌ ఇండియా లో డిప్యూటీ డైరక్టర్‌ క్యాడర్‌లో పని చేస్తున్న ఆదెర్ల రాంబాబు తాను రూ.50 వేలు ఇవ్వటంతో పాటుతోటి మిత్రులను ప్రోత్సహించారు. దీంతో అందరు కలిసి రూ.1.50 లక్షలు కూడ బెట్టారు. వాటిని ఆదివారం కారేపల్లి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిత్రుని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్బంగా సామాజిక విద్యావేత ఎండీ.బాబు మాట్లాడుతూ పూర్వం విద్యార్ధులకు విలువలతో కూడి విద్య నందించేవారమన్నారు. దాని ఫలితమే తోటి వారికి సాయం చేసే గుణం అలవడిందన్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం శశిధర్‌, జాకిర్‌ బాబా, గొడుగు శ్రీను, తొగర రమేష్‌, ఓరుగంటి రంగనాధ్‌, ఎస్‌కె.మతీన్‌, తుమ్మలపల్లి కోటేశ్వరరావు, సిహెచ్‌.కమల, నహీమ్‌, సలీం, కోట రవి, చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.