ముంబయి: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 2025లో ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ను బిసిసిఐ, ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. భారత జట్టు వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఇరుజట్ల మధ్య చివరిసారిగా 2021లో ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. ఈ సిరీస్ 2-2తో డ్రా అయ్యింది. ఇప్పుడీ సిరీస్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నాలుగో సైకిల్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్కూ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. జూన్-జులై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టి20లను ఆడనుంది.
షెడ్యూల్…
తొలి టెస్ట్ : జూన్ 20-24(లీడ్స్)
రెండో టెస్ట్ : జులై 2-6(బర్మింగ్హామ్)
మూడో టెస్ట్ : జులై 10-14(లండన్)
నాలుగో టెస్ట్ : జులై 23-27(మాంచెస్టర్)
ఐదో టెస్ట్ : జులై 31-ఆగస్ట్ 4(లండన్)