డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు

– 20న ధ్రువపత్రాల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 20న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 18 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ ఎనిమిదో తేదీన టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆ పోస్టులకు ఎంపికైన జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను విడుదల చేసింది.
ఈనెల 20న ఉదయం 1030 గంటల నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వివరించారు. ప్రొవిజినల్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు.