ఈ తరం ప్రేక్షకుల కోసం..

For this generation audience..దక్షిణ భాషా చిత్రాలలో కల్ట్‌ క్లాసిక్‌ సినిమాగా నిలిచిన వాటిలో ‘7జీ బృందావన కాలనీ’ చిత్రం ఒకటి. సినిమా విడుదలై రెండు దశాబ్దాల వుతున్నా, ఇప్పటికీ ఎందరికో అభిమాన చిత్రంగా ఉంది. అలాంటి కల్ట్‌ క్లాసిక్‌ చిత్రానికి సీక్వెల్‌గా ‘7జీ బృందావన కాలనీ 2’ రూపొందుతోంది. శ్రీ సూర్య మూవీస్‌ పతాకంపై నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్‌ చిత్రీకరణ తుది దశకు చేరు కుందని నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కట్టిపడేసే కథాకథనాలు, హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించేలా అద్భుతంగా ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచిన రవికష్ణ, మరోసారి తనదైన శైలిలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన సరసన అనశ్వర రాజన్‌ నటిస్తున్నారు. నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ, ‘7జీ బృందావన కాలనీ’ ప్రేక్షకుల హదయాలను హత్తుకున్న చిత్రం. సినీ చరిత్రలో ఈ చిత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు సీక్వెల్‌తో నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త, ఆకట్టుకునే కథనాన్ని అందించి, అప్పటి మ్యాజిక్‌ను పునఃసష్టి చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు.