మాజీ సీఎం కేసీఆర్ కలిసిన జాగృతి అధ్యక్షురాలు పుర్రి స్వరూప 

నవతెలంగాణ – తాడ్వాయి 
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,  తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, ములుగు జిల్లా జాగృతి అధ్యక్షురాలు పుర్రి స్వరూప మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి  శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు పొందారు. తను ఎంతో ఆరాధించే అభిమానించే జననాయకుడు కేసీఆర్  కలిసి ఆయన దీవెనలు పొందడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మరింత బలోపేతం చేసి, పార్టీని బలోపేత చేయాలని అన్నట్లు తెలిపారు. మళ్లీ తెలంగాణ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.