వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఈటెల

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో బిజెపి సీనియర్ కార్యకర్త లోకాని గోపి ముదిరాజ్ చెల్లి ,మెండి అశోక్ ముదిరాజ్ తమ్ముడు దాసు  కీర్తన వివాహ వేడుకకు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ ముదిరాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ కూమార్, నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయన వెంట బిజెపి  మండల అధ్యక్షులు నాయిడి రాజన్న, లోకాని గంగారాం ముదిరాజ్ తోపాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.