మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.ఎస్ కన్నుమూత

నవతెలంగాణ – రాయికల్ 
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో  బాధపడుతున్న మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీమంత్రి డి.శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్ధివ దేహాన్ని నేటి ఉదయం 9 గంటలకు ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మధ్యాహ్నానికల్లా హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు డీఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ కు తరలిస్తారు. రేపు (ఆదివారం) మధ్యాహ్నం డీఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు డిఎస్ కుటుంబ సభ్యులు తెలియజేశారు.