నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారు యూపీఎస్సీ, సి ఎస్ ఏటి 2025 పరీక్ష కోసం 2024-2025 విద్యా సంవత్సరంలో (100) మైనారిటీస్ (ముస్లిం, క్రైస్తావులు, సిక్కులు, బౌద్దులు పార్సిలు) అభ్యర్థులకు ఉచిత కోచింగ్ను నిర్వహిస్తోంది. ఇట్టి శిక్షణకు రిజర్వేషన్ల నియమం ప్రకారం మహిళా అభ్యర్థులకు 33.33% సీట్లు మరియు అన్ని రిజర్వ్డ్ కేటగిరీలలో వికలాంగులకు 3% సీట్ల కేటాయించడం జరుగుతుందని కే. కృష్ణవేణి , జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి, నిజామాబాద్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకొనవలెను ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుంది. యుపిఎస్సి (సిఎస్ఎటి-2025) యొక్క సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని సాధారణ / ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీస్ అభ్యర్థుల ద్వారా తేది.15-03-2024 నుండి ఆన్లైన్ www.tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ.12-04-2024. ప్రవేశ పరీక్షా తేదీ.28-04-2024 (ఆదివారం) న అన్ని జిల్లా కేంద్రములలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన ఆసక్తి కలిగిన మైనారిటీస్ విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలరని కే. కృష్ణవేణి , జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి, నిజామాబాద్ తెలియజేశారు. ఇతర వివరములకు నెం.040-23236112 కార్యలయ పని వేళలో సంప్రదించగలరని కోరారు.