– జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ద్వారా, గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2, గ్రూప్ -3, గ్రూప్ -4, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు, బ్యాంకింగ్ మొదలగు పోటీ పరీక్షల కొరకు సన్నద్దమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు బేసిక్ ఫౌండేషన్ కోర్సునందు (4) నెలల ఉచిత శిక్షణ అందించనున్నారని, అర్హులైన ఆసక్తి కలిగిన మైనారిటీ విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలరని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి దయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మైనారిటీ అభ్యర్థులు (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు బౌద్ధులు, జైనులు, పార్సిలు) తమ దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల దృవీకరణ పత్రం, డిగ్రీ మార్క్స్ మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు (2) మొదలగు ధృవపత్రాలతో తేది 15/02/2025 లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము లో దరఖాస్తు చేసుకోవలసినదిగా ఆ ప్రకటనలో కోరారు. మరిన్ని వివరములకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము, కామారెడ్డి జిల్లా, కొత్త కలెక్ట రేట్ 2వ అంతస్తు రూమ్ నెం.222 లో, ఫోన్ నెం: 8096973346 కు సంప్రదించ వలసినదిగా ఆ ప్రకటనలో ఆయన తెలిపారు.