ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం…

– రైతులకు 24గంటల ఉచిత విద్యుత్..
– పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి.. 
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం మొత్తంలో  మహిళలలకు ఎక్కడి నుండి ఎక్కడి వరకైన రాకపోకలకు ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తామని,రైతులకు నిరంతరాయంగా 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తామని,ఇదే కాకుండా రైతులకు అందుకోవడానికి  రైతన్నలకు రెండు లక్షల రూణమఫి  చేసి తిరుతమని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, పిసిసి ప్రధాన కార్యదర్శి కాటి పల్లి నాగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇందల్ వాయి మండలం లోని ఇందల్ వాయి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, బీడీ కార్మికులు, వృద్ధులు,  వితంతువులకు ప్రతి నేలా 4వేల రూపాయల పేన్షన్ క్రమం తప్పకుండా అందజేస్తామని దినిలో ఎవ్వరికీ అనుమానం అవసరం లేదన్నారు.  ఇందిరమ్మ ఇంటీ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో అందజేస్తామని తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇండ్లు  ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఊసే ఎత్తడం లేదన్నారు.ఎదో ఒక గ్రామంలో ఏళ్ల క్రితం కట్టిన డబుల్ బెడ్ రూం లు పేదలకు అందజేయడం లేదని,ఇది మాటల ప్రభుత్వమని,కాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ ని ఖచ్చితంగా అమలు చేసి తిరుతమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే
 రెండు లక్షల ఉద్యోగాలను ఇచ్చి చుపుతమని, బిఅర్ఎస్ ప్రభుత్వం నీరుద్యోగులకు ఉద్యోగలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తామని పేర్కొన్నారు.ఆరోగ్య శ్రీ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తామని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్య శ్రీ ద్వార 2లక్షల వరకు అందజేసినట్లు నాగేష్ రెడ్డి వివరించారు. వరి, ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వరి కి క్వింటాలుకు 2500 వందలు అందజేస్తామని తెలిపారు. కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి కి నోచుకోలేదని,నాడు కాంగ్రెస్ చేసిన అభివృద్ధే గ్రామాల్లో కనబడుతుందని‌ వివరించారు.త్వరలో కాంగ్రెస్ డిక్లరేషన్ ను ప్రజల ముందు పేడ్తమని, కళాశాలలకు వేళ్ళే విద్యార్థినులకు ఉచితంగా  స్కుటిలను అందజేస్తామని ఇదే కాకుండా ప్రజలకు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని దివించాలని సూచించారు.అనంతరం పలువురు యువకులు పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, డిసిసి డెలిగేట్ సుధాకర్, ముళ్ళంగి ఎంపిటిసి నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, డిసిసి  ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి,పోశేట్టి, శైలేందర్, ఎన్ఎస్ యుఐ రూరల్ అధ్యక్షులు ఆశిష్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, మండల మహిళా అధ్యక్షురాలు జంగిలి లక్ష్మి, సినియర్ నాయకులు ఖాజా హబిబోద్దిద్, వీరేందర్, కరుణకర్, బద్దం రెడ్డి, చుక్కా బోట్ల గంగా మణి, తోట రాజన్న, పూజ్యం వీరయ్య , మైనార్టీ మండల అధ్యక్షులు జమీల్, ఉద్వేగంగా రవి,ఎల్ ఐ సి గంగాధర్, మండల, గ్రామస్థాయి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.