– షీటీమ్స్తో మహిళలకు రక్షణ
– శాంతిభద్రతలుకట్టడిలో ఉన్నందునే 50 వేల పరిశ్రమల స్థాపన,
– ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను అమలులో పెడుతున్న పోలీస్
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
యావత్ భారతదేశంలో ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నది ఒక్క తెలంగాణలోనేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.షీటీమ్స్ తో మహిళలకు సంపూర్ణ రక్షణ కలిపిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ఘనతకెక్కిందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్దిఉత్సవాలు సూర్యాపేటలో ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం స్థానికంగా పోలీస్ యంత్రాంగం నిర్వహించిన సురక్ష దినోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు.కక్షలు కార్పణ్యాలతో తల్లడిల్లిన పల్లెల్లో శాంతి కపోతాలు ఎగురుతున్నాయి అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతేనని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను తూచ తప్పకుండా పోలీస్ శాఖా అమలు పరుస్తున్నందునే తొమ్మిదేళ్లలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగ లేదన్నారు. ఫ్రాక్షన్ విలేజీల్లోనూ ప్రశాంతత ఫరీడవిల్లుతున్నది అంటే ప్రజా క్షమం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చొరవ మాత్రమేనన్నారు.ఆధునిక పరిజ్ఞానంతో శాంతిభద్రతలను పరిరక్షించేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అని అది ఇప్పుడు దేశానికే దిక్సూచి గా మారిందన్నారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కట్టడిలో ఉన్నందునే పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి 50 వేల పరిశ్రమలు నెలకొల్పారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను పోలీస్ శాఖ అమలు పరుస్తునందునే తెలంగాణా పోలీస్ అద్భుత విజయాలు నమోదు చేసుకుందన్నారు.సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, శాసనసభ్యులు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జెడ్పీ వైస్చైర్మెన్ వెంకట నారాయణగౌడ్,కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎస్పీలు వెంకటేశ్వరరెడ్డి,రవి తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు కొత్త బస్టాండ్ నుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం నిర్వహించిన ర్యాలీని మంత్రి జగదీశ్రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు.