నేటినుంచి ఇంజినీరింగ్‌ రెండోవిడత కౌన్సెలింగ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో 2024-25 విద్యాసం వత్సరంలో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సె లింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. శుక్రవారం ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకో వాలని తెలిపారు. ఈనెల 27న ధ్రువపత్రాల పత్రాల పరిశీలన నిర్వహి స్తామని వివరించారు. ఈనెల 27,28 తేదీల్లో వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేం దుకు అవకాశముందని పేర్కొన్నారు. అదేనెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇతర వివరాల కోసం https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.