– సమర్థతను, నాణ్యతే లక్ష్యంగా భాగస్వామ్య ఒప్పందాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ(ఎఫ్టీసీసీఐ) 106 ఏండ్ల ట్రేడ్, కామర్స్, ఇండిస్టీ బాడీ, 41 ఏండ్ల క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా మంగళవారం రాత్రి వరకు జరిగిన ఒక కార్యక్రమంలో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రెడ్హిల్స్లోని ఫెడరేషన్ హౌస్లో ఈ కార్యక్రమం జరిగింది.
రెండు సంస్థలు, తమ తమ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి, నాణ్యతను, సమర్థతను, శ్రేష్ఠతను పెంచుకోవడానికి కలిసి వచ్చాయి. ఎఫ్టీసీసీఐ తరపున ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, క్యూసీఎఫ్ఐ తరపున డైరెక్టర్ బొడ్డపాటి శ్రీనివాస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేష్కుమార్ సింఘాల్ సమక్షంలో పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. అవగాహనా ఒప్పందాన్ని సంతకం చేయడం సహకారం, నాణ్యతను, సమర్థతను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్అగర్వాల్ అన్నారు. భవిష్యత్తుకు నాణ్యతే ఏకైక మార్గమని అన్నారు. ఇది సంస్థకు అధిక ఆదాయాలు, ఉత్పాదకతను నిర్ధారిస్తుందన్నారు. నాణ్యత వ్యర్థాలు, ఖర్చులు నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు. నాణ్యత ఖ్యాతిని, బ్రాండ్ విలువను పెంపొందించడానికి సహాయపడుతుందని వివరించారు. జులై 17 నుంచి 19 వరకు ‘నాణ్యత, విశ్వసనీయత కోసం బెంచ్మార్కింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించబోతోందన్నారు. క్యూసీఎఫ్ఐ లాభాపేక్ష లేని, రాజకీయ రహిత, జాతీయ వత్తిపరమైన సంస్థ అని, మానవ ప్రయత్నంలోని ప్రతి రంగంలో చురుకైన ప్రమేయం, భాగస్వామ్యం కోసం వాతావరణాన్ని సష్టించే ఉద్దేశ్యంతో ఏర్పడిన సంస్థ అని బొడ్డపాటి శ్రీనివాస్ అన్నారు. ప్రజల మొత్తం నాణ్యతను అభివృద్ధి చేయడానికి అవసరమైన, అంతర్భాగంగా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పరిధిని విస్తరిస్తుందన్నారు. ఎఫ్టీసీసీఐ సీఈఓ ఖ్యాతి నర్వానే, స్కిల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అంకిత్ భట్నాగర్, సీనియర్ ఫ్యాకల్టీ సీవీ.రమణ, క్యూసీఎఫ్ఐ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సీఓఓ సునీల్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.