– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
‘ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేస్తాం. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆవార్డులు ప్రదానం చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహిస్తాం. అలాగే కల్చరల్ ఐకాన్ గద్దర్కి సంబంధించి ప్రతిదీ పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని అధికారులకు పలు సూచనలు ఇచ్చాం. సినిమా నిర్మాణంలో హైదరా బాద్ను ప్రపంచ గమ్య స్థానంగా మార్చేందుకు కషి చేస్తున్నాం. గత పది సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన వారు చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారు. అవార్డుల పంపిణీ జరగలేదు. ఇందిరమ్మ ప్రభు త్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్స హించే గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం అందజేస్తాం’ అని తెలిపారు.
గద్దర్ అవార్డుల కోసం లోగోతో సహా విధి విధానాలు, నియమ, నిబంధనల పై కమిటీ సమావేశం జరిగింది. అలాగే ఫీచర్ ఫిల్మ్లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అవార్డులలో నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందచేస్తారు.
ఈ సమావేశంలో టీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, ఎండీ డాక్టర్ హరీశ్, ఈడీ కిషోర్బాబు, కమిటీ చైర్మన్ బీ నర్సింగ్రావు, కమిటీ సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్, హరీశ్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్, వేణు తదితరులు పాల్గొన్నారు.