కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణం మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ ఎంఎల్ఏ గంప గోవర్ధన్ జన్మదిన సందర్భంగా కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యం లో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ని గత పదేండ్లలో లో గంప గోవర్ధన్ చేసిన అభివృద్ధిని గుర్తుచేశారు. ప్రజలకు ఎల్లపుడు అండగా ఉండే గంప గోవర్ధన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో యూత్ నాయకులు పరుశురాం గౌడ్, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, శ్రీను, ఆనంద్, సాయిచరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.