డిగ్రీ ఫలితాల లో బాలికలదే పై చేయి..

– ఫలితాలను విడుదల చేసిన రిజిస్ట్రార్ ఎం యాదగిరి..
నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని  డిగ్రీ (ఫైనల్)  తుది  సెమిస్టర్ ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్   కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి  మాట్లాడుతూ  యూనివర్సిటీ పరిధిలో 40.53%  విద్యార్థులు  ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.మొత్తం డిగ్రీ  పరీక్షలకు 9026 మంది హాజరు కాగా 3658 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారాని పేర్కొన్నారు.
ఇందులో   అధికంగా  51.80% శాతoతో బాలికలు ముందున్నారని పేర్కొన్నారు.బాలురు  24.16% శాతo  ఉత్తీర్ణత సాధించినారని  తెలిపారు.ఉత్తీర్ణులైన విద్యార్థులకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి  శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పరీక్ష ఫలితాలను వేగవంతం చేసిన ఎగ్జామ్ ఎగ్జామ్ బ్రాంచ్ అధికారులను, ఉద్యోగులను  వైస్ ఛాన్స్లర్  వాకాటి కరుణ ఐఏఎస్ గారు  అభినందించారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి తెలిపారు.ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో  యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ , అడిషనల్ కంట్రోలర్ లు డాక్టర్. శాంతాబాయి. డాక్టర్ నందిని  ఆడిట్ సెల్ డైరెక్టర్  ప్రొఫెసర్ డాక్టర్ గంట చంద్రశేఖర్, డైరెక్టర్( పిఆర్ఓ ) డాక్టర్.ఏ పున్నయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.