
పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు జిల్లాస్థాయి గణిత ప్రతిభ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినులు రుణ ఖతూన్, సాహితీలతో పాటు ఉపాధ్యాయునులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు కవిత గంగామని, క్విడిజ మెహిన్, రిజ్వానా ,రమ్య, తదితరులు పాల్గొన్నారు.