సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌.. గాడ్‌

Seat edge thriller.. God‘తనీ ఒరువన్‌’ వంటి సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత జయం రవి, నయన తార హీరో, హీరోయిన్లుగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌’. ఐ.అహ్మద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్‌ సుందరం, జి.జయరాం, సి.హెచ్‌.సతీష్‌ కుమార్‌ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఈనెల 13న తెలుగులో రిలీజ్‌ కానుంది.
ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ ఆదరణ ఉంటుంది. ఆ కోవలో తమిళంలో విడుదలైన మంచి విజయాన్ని సాధించిన ‘ఇరైవన్‌’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్‌’ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రన్‌ టైమ్‌ను 2 గంటల 16 నిమిషాలుగా ఫిక్స్‌ చేశాం. హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. ఈనెల 13న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ఆసాంతం సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’ అని చెప్పారు.