మిరప రైతులకు భరోసా ఇస్తున్న గోద్రెజ్ రాషిన్‌బాన్

నవతెలంగాణ హైదరాబాద్: మిరప మొక్కలో కీలకమైన ఆర్థిక భాగమైనందున, మిరప సాగులో పువ్వులు  విజయానికి అత్యంత కీలకం. ఈ కీలకమైన వాస్తవాన్ని గుర్తించి, ఈ కీలకమైన మొక్కల నిర్మాణాలను రక్షించే శాస్త్రీయ పరిష్కారాలను రైతులు స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

” పూత సమయం అంటే రాషిన్‌బాన్ సమయం” అని జిఏవిఎల్ , క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ -సీఈఓ  ఎన్ కె రాజవేలు పేర్కొన్నారు. “ఈ రోజు మిరప రైతులు తమ పంట ఎదుగుదల పరంగా  సరైన సమయంలో సరైన పోషకాలను అందేలా చూసుకోవాల్సి ఉంది. అదే సమయంలో భూసారం కోల్పోకుండా (అబియోటిక్) చూసుకోవాలి. పురుగుమందుల అశాస్త్రీయ కలయికలు పంటలను మరియు పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది పంట దిగుబడిని ప్రభావితం చేయడమే కాకుండా వారి పొలాల సున్నితమైన పర్యావరణ సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది. ఈ సమస్యలను రాషిన్‌బాన్ పరిష్కరిస్తుంది. పంట నాటిన  45-75 రోజుల వద్ద రాషిన్‌బాన్ ఉపయోగించినప్పుడు, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది ఒక సారి వినియోగిస్తేనే  తామర పురుగు (త్రిప్స్) , లెపిడోప్టెరాన్స్, పచ్చ దోమ ( హాప్పర్స్)  మరియు నల్లి (మైట్స్‌)తో సహా అనేక రకాల కీటకాలను నాశనం చేస్తుంది. ఇది రైతులకు సమయం మరియు కృషిని ఆదా చేస్తుంది, వారి పంట యొక్క ఆర్థిక విలువను కాపాడుతుంది.
రసం పీల్చు  ఆకు నమిలే వంటి విస్తృత స్థాయి కీటకాల పై రాషిన్‌బాన్ ప్రభావవంతంగా పనిచేయటం వల్ల పలు రకాల పురుగుమందుల వినియోగపు అవసరాన్ని తొలగిస్తుంది , ఎక్కువ మార్లు స్ప్రే చేయాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. నాటిన 45-75 రోజుల వద్ద పూత ఏర్పడే సమయం లో ఉపయోగించినప్పుడు, ఇది తరువాతి దశలలో మంచి దిగుబడికి హామీ ఇస్తుంది.
రాజవేలు మాట్లాడుతూ, “మిరప రైతు విజయాన్ని నిర్వచించేది పువ్వులు  మీ మిరప పువ్వులను రాషిన్‌బాన్ తో రక్షించుకోవడం చాలా ముఖ్యం. సమగ్రమైన రక్షణ అందిస్తుండటం వల్ల  మిరప మొక్కలు  పూత దశకు చేరుకున్నప్పుడు వినియోగానికి ఇది ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది. ఇప్పటికే ఉన్న గ్రాసియా మరియు హనాబీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోతో పాటు, రాషిన్‌బాన్  ను కూడా జోడించడం ద్వారా మిరప పంట మొత్తం వాల్యూ చైన్ లో రక్షణ అందించగలుగుతున్నాము” అని అన్నారు. శాస్త్రీయ విధానాన్ని అవలంబించడం ద్వారా –  గ్రాసియాతో  ప్రారంభించి, రాషీన్‌బాన్‌ తో నాటిన 45-75 రోజుల  యొక్క క్లిష్టమైన దశలో మీ మిరప పంట పువ్వులను రక్షించడం ద్వారా – మిరప రైతులు ఆరోగ్యకరమైన మరియు చీడపీడలు లేని పంటలు, మెరుగైన దిగుబడులు మరియు ఉజ్వల భవిష్యత్తు ను పొందవచ్చు, తద్వారా ప్రముఖ మిరప ఎగుమతిదారుగా భారతదేశ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు.