నవతెలంగాణ మల్హర్ రావు: సాయిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు పురస్కరించుకుని ఆల్ ఇండియా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ (రిజిస్ట్రేషన్ నెంబర్ 542) జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్,పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కె.వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మన్ చేతులమీదుగా కాళేశ్వరం జోన్ మల్హర్ మండలంలో అంగన్ వాడి టీచర్లలో ఉత్తమ మహిళ ఉద్యోగులుగా ఎంపికైన గడ్డం పద్మ (మల్లారం జిపి అంగన్ వాడి సెంటర్-3), దూలం అన్నపూర్ణ (పెద్దతూoడ్ల జిపి అంగన్ వాడి సెంటర్-3), తోకల రమాదేవి (ఆన్ సాన్ పల్లి జిపి అంగన్ వాడి సెంటర్-1), తమ్మిశెట్టి జయప్రద (తాడిచెర్ల జిపి అంగన్ వాడి సెంటర్-7) తదితరులకు గోల్డ్ మెడల్స్, ప్రసంశ పత్రాలు,అవార్డులు,శాలువాతో ఘనంగా సన్మానాలు,పూలే జీవిత చర్తిత్ర గ్రంధం అందజేసినట్లుగా ఎంపిక కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్,జాతీయ మానవ హక్కుల మండలి మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహానియురాలు సావిత్రీబాయి పూలే 194 జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రములోని అమర్ చంద్ కల్యాణ మండపం జెండా చౌరస్తాలో ప్రశంస పత్రాలు, మెమెంటోలు అందజేసీనట్లుగా తెలిపారు.