సుదర్శన్ పరుచూరి హీరోగా ‘మిస్టర్ సెలెబ్రిటీ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. చందిన రవి కిషోర్ దర్శకత్వంలో ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్.పాండు రంగారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ జతగా’ అంటూ సాగే మెలోడీ పాటను హీరో గోపీచంద్ రిలీజ్ చేశారు. ఈ పాటను గణేష్ రచించగా.. జావెద్ అలీ ఆలపించారు. వినోద్ యాజమాన్య చక్కటి సోల్ఫుల్ బాణీని అందించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ,’పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్ చాలా బాగుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన పాట కూడా చాలా బాగుంది. చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.