మండలిని సందర్శించిన సర్కారు బడి విద్యార్థులు…

– స్వాగతం పలికిన ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ – హైదరాబాద్

ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని సందర్శించారు. విద్యార్థులకు ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరు, సభా కార్యకలాపాలు జరిగే పద్ధతి గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్‌ చాంబర్‌లో ఫొటో దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మండలి పనితీరు తెలుసుకోవడంతో ప్రజాసేవపై ఆసక్తి పెరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.