
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా సాయంత్రం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సుకు రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, టూరిజం ఎం.డి. ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్,ఎస్పీ శబరిష్ లతో కలిసి చేరుకున్నారు.. స్థానిక అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గవర్నర్ కు స్వాగతం పలికారు ముందుగా వేలాడే స్పెషన్స్ వంతెన పైనుండి లక్నవరం అందాలను గవర్నర్ వీక్షించారు.