రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

Farmer's welfare is government's aim: Government Whip Adi Srinivas.నవతెలంగాణ – కొనరావుపేట 
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని  ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్, జిల్లా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు.  జిల్లాలోని 23వేల పై చిలుకు రైతులకు దాదాపు రూ.137 కోట్లు మాఫీ కానున్నాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతుందని పేర్కొన్నారు. వ్యవసాయ భూమి ఉండి, పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు బ్యాంక్ లో రుణం తీసుకుంటే కచ్చితంగా రుణ మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. రైతులకు సాగులో నూతన పద్ధతులు, యంత్ర పరికరాలు వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు అందించేందుకు రైతు వేదికల్లో రైతు నేస్తం పేరిట కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్డీవో రాజేశ్వర్, డీఏఓ భాస్కర్, మండల వ్యవసాయ అధికారి వెంకటరావమ్మా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి. మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ సింగల్ విండో చైర్మన్ బండ నర్సయ్య  మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఫిరోజ్ పాషా జిల్లా కాంగ్రెస్ నాయకులు చేపూరి గంగాధర్ . కచ్చకాయల ఎల్లయ్య .గొట్టే రుక్మిణి  . తాళ్లపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.