– భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్….
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల మంచి మధ్యాహ్నం వరకు అన్ని గ్రామాలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఆయా తేదీలలో జరిగే గ్రామసభలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులందరికీ రేషన్ కార్డుల వివరాలు గ్రామ సభ ముందు ఉంచబడతాయనీ, ఎవరైనా ఏ పథకం కోసమైనా లబ్ధి చేకూరడం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే, వారు గ్రామసభ లోనే ప్రత్యేకంగా ఏర్పరిచిన కౌంటర్లలో వారి దరఖాస్తులు ఇచ్చి రసీదు పొందవచ్చనారు.