ఘనంగా గణతంత్ర వేడుకలు

– అలరించిన విద్యార్థుల నృత్యాలు, విన్యాసాలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో  శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ఆంజనేయులు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో సంతోష్ రెడ్డి, కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రాజశేఖర్, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ రేగుంట దేవేందర్, అటవీ రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి రవీందర్, సెర్ఫ్ కార్యాలయం వద్ద ఏపీఎం కుంట గంగారెడ్డి, ఆయా గ్రామాల్లో సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు గౌతమి, మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్ మైలారం గంగాధర్, ఈజిఎస్ ఏపిఓ విద్యానంద్, ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బహుమతుల ప్రధానం….
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. అంతకుముందు  మండల కేంద్రం తో పాటు గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పాఠశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, స్వీట్లను పంపిణీ చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా స్థానిక శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీలో భాగంగా జాతీయ రహదారిపై చేసిన విన్యాసాలు, నృత్యాలు ఆహుతులను అలరించాయి.