– గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 16 ఫిర్యాదులు స్వీకరణ
నవతెలంగాణ – సిరిసిల్ల
బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో
సోమవారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల వద్ద నుండి 16 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని అదనపు ఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.భూ తగాదాలు,ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు.గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు.