ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ…

– గ్రూప్-II  పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 
– పరీక్షా కేంద్రాల వద్ద 600 మంది సిబ్బందితో  పటిష్ట భద్రత…
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ పట్టణ కేంద్రంలోని ది నల్గొండ పబ్లిక్ పాఠశాల నందు ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ సోమవారం పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ II పరీక్షా కేంద్రాల వద్ద  అభ్యర్థులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా 87 పరీక్ష కేంద్రాల వద్ద దాదాపు 600 మంది సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ  తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్   అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకుండా చూడాలని, పోలీసు అధికారులకి సిబ్బందికి సూచించారు.  అందరు బాధ్యతగా పని చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష పత్రాలు స్ట్రాంగ్ రూముకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఎస్పీ  తెలిపారు.