సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ఈ సినిమాని డా.ఆరవేటి యశోవర్ధాన్ ఏ బి డి ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ధర్మ మాట్లాడుతూ, ”గల్లీ గ్యాంగ్ స్టార్స్ అనేది సినిమా కాదు నిజ జీవితంలో ఎందరో అనాథలు ఎదుర్కొనే రోజువారి సంఘటనలు. అనాధల బాధ్యత సమాజం తీసుకోకపోతే ఆ సమాజం ఎన్ని దారుణాలు ఎదుర్కోవాల్సి వస్తుందో వాస్తవికంగా తెరకెక్కించాం. సినిమా షూటింగ్ అంతా నెల్లూరులో 76 రోజుల పాటు చేశాం. ఎన్నోసార్లు అనుకున్న బడ్జెట్ దాటిపోయి షూటింగ్ ఆగిపోయింది. అనుకున్న ప్రతిసారి ప్రొడ్యూసర్ యశోవర్ధన్ ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యటం వల్లనే ఈ సినిమా ఈరోజు రిలీజ్ కాబోతుంది. ఈ బ్యానర్లో ఆయన నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ, మూడు సినిమాలను వరసగా నిర్మించారు. దానిలో మొదటి సినిమా ప్రయోగాత్మకమైన చిత్రం ‘మే16’. ఇది ఒక మోనో డ్రామా. ఆ తర్వాత చిత్రం నెల్లూరు గల్లిలో జరిగే మాస్ డ్రామా సినిమా ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’ . ఇదే బ్యానర్లో వస్తున్న మరో సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది’ అని తెలిపారు.