– పది ఎకరాల లోపు రైతు భరోసా
– తెలంగాణలో 34, ఏపీలో 50 అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయం
– మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని రూ. 7లక్షల కోట్ల అప్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా శ్వేత పత్రం విడుదల చేసిందని శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకపోయిందన్న విషయం బహిరంగ రహస్యమే అయినందున ఇలాంటి పరిస్థితిలో ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని హితవు పలికారు. రైతు బంధు, రైతు భరోసా కేవలం పది ఎకరాల వరకు ఇస్తే చాలని,సేద్యం చేసే భూముల కు మాత్రమే రైతు బంధు ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం మంచిదేనని అన్నారు. ఇక రాష్ట్ర శాసన మండలి రద్దు అనేది అసంబద్ధమని, అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాదని సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే రెండేళ్ల లో 2026 సంవత్సరంలో నియోజక వర్గాల పునర్విభజన చట్టం అమలవుతుందని, అప్పుడు తెలంగాణలో 36, ఆంధ్రప్రదేశ్ లో 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హత విషయంలో గతంలో మండలి చైర్మన్, స్పీకర్ గా వ్యవహరించిన వారు తీసుకున్నట్టుగానే తన నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పారు. శాసనమండలి చైర్మన్ హోదాలో ఉండి రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు. ఏపీ,తెలంగాణ ముఖ్య మంత్రులు భేటీ కావడం శుభపరిణామమని, చాలాకాలంగా పెండిం గ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల సీఎంల కలయికను అభివృద్ధి కోణంలోనే చూడాలని, అందులో రాజకీయ కోణం జొపించవద్దని అన్నారు. సీఎం ప్రతిపక్షాల బెదిరంపులకు అస్సలు భయపడ వద్దని, అప్పుడే అభివృద్ధి చేసుకోగలుగుతామని అన్నారు. తెలంగాణ కు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలు మినహా మరో మార్గం లేదని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి సీఎం ఎంతో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఎస్ఎల్ బీసీ పెండింగ్ పనులు పూర్తి చేయాలని, తద్వారా నల్లగొండ జిల్లాలో సాగు నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చాలా కష్టపడుతున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయని అనుకుంటున్నట్లు తెలిపారు.