నవతెలంగాణ-కోట్పల్లి
కోట్పల్లి మండల మైనార్టీ అధ్యక్షుడుగా రాంపూర్ గ్రామానికి చెందిన హాజీ మియాను వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మంగళవారం నియమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుందరి అనిల్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, రైతుబంధు అధ్యక్షుడు సత్యం. ఏఏంసి వైస్ చైర్మన్ ఫయాజుద్దీన్, ఏఎంసి వైస్ మాజీ చైర్మన్ దశరథ్ గౌడ్, సర్పంచులు గొడ్డలి మల్లన్న, పాండురంగారెడ్డి, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి మోత్కుపల్లి మజీద్, సదర్, ముస్తాక్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ హుస్సేన్, మైనార్టీ నాయకులు మహబూబ్ అలీ, మైబు పటేల్, రషీద్, యాకూబ్, మైనార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.