– నేటి నుంచి వింగ్స్ ఇండియా
నవ తెలంగాణ – బిజినెస్ బ్యూరో
ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) తన హిందుస్థాన్-228 ఎయిర్క్రాఫ్ట్, ధవ్ ఛాపర్ను ప్రదర్శనకు పెడుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి హైదరాబాద్లో ఇన్ వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన ప్రారంభం కానుంది. జనవరి 18-21 వరకు ఇక్కడి బేగంపేట విమానాశ్రయంలో జరుగనుంది. హిందుస్థాన్ 228 ఎయిర్క్రాఫ్ట్ అనేది ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్, ఉడాన్ కింద స్వల్ప దూరపు విమాన మార్గాలలో రిమోట్ ప్రాంతీయ కనెక్టివిటీని అందించడానికి హెచ్ఎఎల్ స్వదేశీంగా వీటిని అభివృద్థి చేసినట్లు హెచ్యుఎల్ సిఎండి (అడిషనల్ చార్జ్) సిబి అనంత క్రిష్ణ తెలిపారు. వింగ్స్ ఇండియాలో వివిధ ప్రాజెక్ట్ల కోసం తమ వ్యాపార భాగస్వాములతో ఒప్పందాలపై సంతకాలు చేయడంతో పాటు ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, కస్టమర్లతో వ్యాపార సమావేశాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడానికి ‘మేడ్ ఇన్ ఇండియా’ ఫిక్స్డ్ వింగ్ సివిల్ ఎయిర్క్రాఫ్ట్ చొరవను పోత్సహిస్తున్నామని తెలిపారు. ”డార్నియర్-228, హెచ్ఎస్-748 టర్బోప్రాప్ ఎయిర్లైనర్ వంటి విమానాలను తయారు చేయడంలో కంపెనీ తన బలాన్ని ఉపయోగించుకుంటుంది. ప్రాంతీయ రవాణా ఎయిర్క్రాఫ్ట్ వంటి పౌర విమాన కార్యక్రమాలకు తన సామర్థ్యాలను విస్తరింపజేస్తోంది. హెచ్ఎఎల్ కూడా ఎంఆర్ఒ (నిర్వహణ, నిర్వహణ, మరమ్మత్తు) కార్యకలాపాలలోకి ప్రవేశించనుంది” అని అనంత క్రిష్ణ తెలిపారు.