నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండలంలోని హసా కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుస్స కృష్ణకుమార్ గురువారం తెలిపారు. ఆలూరు మండలం కల్లెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో మంద ప్రతిభ, జుంబరత్ అనురామ్ లు మంచి ప్రతిభ కనబరిచారన్నారు. విద్యార్థుల ఉత్తమ ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక చేశారని ఆయన తెలిపారు. ఈనెల 8, 9 తేదీలలో సిద్దిపేటలో జగనున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో ప్రతిభ, అనురామ్ లు పాల్గొంటారని వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మంద ప్రతిభ, జుంబరత్ అనురామ్ లను, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మాధురి ని ప్రధానోపాధ్యాయులు బుస్స కృష్ణకుమార్, ఉపాధ్యాయ బృందం సభ్యులు అభినందించారు.