– అత్యవసర సేవలు మాత్రమే అందిస్తాం
– ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ – కామారెడ్డి
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా లో శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులలో సేవలను నిలిపివేస్తున్నామని, అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించడం జరుగుతుందని కామారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రమణ, కార్యదర్శి డాక్టర్ అరవింద్ గౌడ్లు ఒక ప్రకటనలో తెలిపారు. మెడిసిన్ చదువుకుంటున్న విద్యార్థినిని కిరాతకంగా రేప్ చేసి, హింసించి గొంతు నులిమి హత్య చేసిన మానవ మృగానికి శిక్ష పడే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని అందులో భాగంగా ఒక్కరోజు వైద్యుల తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. పోలీసులు కేసును సరైన రీతిలో పరిశోధన చేయకపోవడంతో హైకోర్టు ఆ కేసును సిబిఐకి అప్పగించిందని విచారణ ఏ విధంగా చేస్తున్నారో మరి విచారణ లో ఎలాంటి రాజకీయం లేకుండా చేస్తే తమకు న్యాయం జరుగుతుందని తాము పది మంది ప్రాణాలను రక్షించే బాధ్యతలో ఉన్నామని అలాంటిదే తనకే భద్రత లేకపోతే తమ ఎలా విధులు నిర్వహించగలుగుతామని దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నిందితునికి కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. శనివారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు వారు తెలిపారు.