బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరించి, నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి తమ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని ప్రచారాన్ని మొదలుపెట్టాయి. న్యూ పెన్షన్ స్కీమ్కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఊపందుకున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ స్కీము నుండి పాత పెన్షన్ విధానానికి మారడానికి నిర్ణయాలు చేసి అమలు కూడా చేస్తున్నాయి. నూతన పెన్షన్ స్కీమ్ అంగీకారయోగ్యం కాదని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధ రించాలని రాజస్థాన్, చత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలోని బీజేపీయేతర పార్టీ ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. ఈ పార్టీలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ప్రస్తుతం అమలు కోసం ప్రకటించాయి. కేంద్రం మాత్రం నూతన పెన్షన్ విధానం అమలుకు తన నిబద్ధతను తెలియజేస్తూ పార్లమెంటులో ప్రకటించింది. పాత పెన్షన్ విధానానికి తిరిగి రివర్షన్కు ఎంచుకునే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తాయని కేంద్ర ప్రభుత్వ అనుకూల ఆర్ధిక వేత్తలు, అనుకూల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేస్తున్నవి. అంతేకాక, ఉద్యోగుల ఓట్లు సంపాదించుకోడానికి ఆయా పార్టీలు ఎంచుకున్న ఎత్తుగడగా కూడా అభివర్ణిస్తున్నవి.
పాత పెన్షన్ విధానం కింద సభ్యులుగా వున్నవారు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన రెగ్యులర్ ఉద్యోగులు 2004కు ముందు సర్వీసులో వున్నప్పుడు ఎటువంటి తన వాటా షేర్ను చెల్లించకుండానే పదవీ విరమణ తదుపరి, చివరగా తీసుకున్న వేతనంలో సగానికి సగం పెన్షన్ పొందుతారు. దీనిని నిర్దిష్ట పెన్షన్ ప్రయోజన పథకం అంటారు. అంతేకాక, పదవీ విరమణ తదుపరి, ఆ కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తుంది. పదవీ విరమణ తరువాత, ధరల పెరుగుదలకు అనుగుణంగా కరువు భత్యం రిలీఫ్ను, పెన్షన్పై నిష్పత్తిగా చెల్లి స్తారు. ఇదే విధంగా సర్వీసులో ఉన్నప్పుడు కూడా కరువు భత్యం పేరుతో మూల వేతనంపై నిష్పత్తిగా ఇస్తారు. ప్రజలకు సేవ అందించే ఉద్యోగులకు విరమణ తరువాత వారి సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే అవసరమైన నిర్వచించబడిన నిర్దిష్టమైన ప్రయోజనం సమకూర్చు పథకం అని అర్ధం. నూతన పెన్షన్ బిల్లు పథకం రూపకల్పన అంటే, పథకం ప్రయోజనాలను అందించే సంస్థల పెన్షన్ బిల్లు, ఉద్యోగుల వేతనాల నుండి 10శాతం వాటా నిధులను ప్రభుత్వం తరపు నుంచి 14శాతం వాటా నిధులను సమకూరుస్తుంది.ఈ నూతన పెన్షన్ పథకాన్ని అమలుచేయుటకు అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, భారతదేశంలోనే కాకుండా, అనేక ఇతర దేశాలలోనూ ఇలాంటి పథకాలు అమలులో వున్నాయి.
ప్రజలకు సేవలందించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా, ఇతర సంస్థలలో 20 లేదా అంతకంటే ఎక్కువ మంది. కార్మికులు పనిచేసే సంస్థలలో తప్పనిసరిగా పదవీ విరమణ పొదుపు పథకం వర్తిస్తుంది. అటువంటి సంస్థలలో ఉద్యోగి అతని లేక ఆమె జీతంలో 10 శాతం వాటాను ఈ పథకానికి అందించ వలసి వుంటుంది. ఈ పథకానికి యజమాని నుండి కూడా సహ కారం అందించబడుతుంది. ఈ సేకరించబడిన సొమ్ము మొత్తాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థచే నిర్వహించబడుతుంది. పదవీ విరమణ తరువాత, ఉద్యోగి ఏకమొత్తం చెల్లింపునకు అర్హులు. మిగిలిన భాగాన్ని యాన్యుటీ చెల్లింపు పథకాలలో పెట్టు బడి పెట్టగా వచ్చిన దానిని పెన్షన్గా చెల్లిస్తారు. అనేకమంది కార్మికులు చిన్న అనధికారిక, ప్రయివేటురంగ యూని ట్లలో లేదా స్వయం ఉపాధి పొందుతున్న చాలామంది. కార్మికులు కూడా ఈ పథకం నుండి దూరంగా వున్నా రంటే ఆశ్చర్యం కాదు. వారు ఇకపై పని చేయలేనప్పుడు, పొదుపు చేయడానికి. తగినంత సంపాదించలేని వారికి అందించడానికి అధికారిక సామాజిక రక్షణ పథకాలలో కొన్ని అధికారికంగా నిర్వచించబడిన దారిద్య్రరేఖకు దిగువన వున్న వారికి కంట్రిబ్యూషన్ లేకుండానే పెన్షన్ను చెల్లిస్తున్నారు. ఈ పథకంలో పెన్షన్ రూపంలో చెల్లించేది. చాలా అల్పమయినదే.
ప్రస్తుత వైరుధ్యం పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పథకాలకు సంబంధించినది. పాత పెన్షన్ పథకాన్ని రద్దుచేసి, నూతన పెన్షన్ పథకంతో భర్తీ చేయాలనే నిర్ణయం, పాత పెన్షన్ పథకం ఆర్ధికంగా నిలకడగా లేనందున సమర్ధించబడుతోంది అనే వాదన కూడా వుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీవితకాలం పెరగడం, ధరల పెరుగుదల ఆధారంగా హామీ ఇవ్వబడిన కరువు భత్యంతో పెన్షన్లో పెరుగుదల ఫలితంగా, ప్రతి వ్యక్తి పెన్షన్ సొమ్ము పెరిగింది. కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ బిల్లులో పెరుగుదల ఏర్పడింది. మరొకవైపు ఆదాయాలు తగినంతగా పెరగడం లేదు. కారణం ఆర్ధికలోటు జిడిపిలో రుణాల స్థాయి పెరగకుండా ఉండాలంటే, సామాజికంగా వ్యయంతో (పెన్షన్ తదితర వ్యయాలు) సహా ఇతర వ్యయాలను తగ్గించవలసి వుంటుంది. ఈ వాదన రెండు స్పష్టమైన ప్రశ్నలకు దారితీస్తుంది. ముందుగా పెన్షన్ బిల్లులో పెరుగుదలకనుగుణంగా ఆదాయాలు ఎందుకు లేవు? రెండవది లోటు, రుణం స్థాయిని ఏది నిర్ణయిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి భిన్నంగా వున్నాయి..
కేంద్రం విషయానికొస్తే, నయా ఉదారవాద విధానాల అమలు వల్ల ఆర్ధికంగా పతనం చెంది ఆదాయ వృద్ధి లేకుండా వుంది. ఇది అభివృద్ధికి దారి తీస్తుందని అంచనా వేసి ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించబడానికి కేంద్ర ప్రభుత్వం అవలంభించిన పన్ను విధానమే! ఉదాహరణకు 2019-20లో లాభ దాయకమైన సంస్థలపై పన్ను రేటు కేవలం 22.5 శాతం ఉందని ఒక సర్వే చెబుతోంది. అయితే కేవలం రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వున్న కంపెనీలకు అవసరమైన చట్టబద్ధమైన రేటు (మినహాయింపులు, రాయితీలు లేకుండా) 34 శాతంగా వుంది. నయా ఉదారవాదం అంటే, ఆర్ధిక మూలధనాన్ని తగ్గించాల్సిన అవసరం వున్నందున, ద్రవ్య లోటును తప్పనిసరిగా పూడ్చాలి. ఈ లోటు, ఆర్ధిక వ్యయం రాష్ట్ర ప్రయోజనాలకు హాని కరంగా పరిగణిచింది. తద్వారా మొత్తం వ్యయం పెరుగుదలపై పరిమితిని నిర్దేశి స్తుంది. ఈ పరిమితి, పెన్షన్ బిల్లు పెరిగే రేటు కంటే తగ్గితే, పన్ను రాబడిని పెంచాలి. లేదా ఇతర ఖర్చులను తగ్గించవలసి వుంటుంది. ప్రయివేటు లాభదాయకతను ప్రోత్సహించే నయా ఉదారవాద నిబద్ధత కారణంగా పన్నురాబడిలో పెరుగుదల విస్మరించబడింది. కాబట్టి సర్దు బాటును నిర్ధారించడానికి, ఖర్చులను తగ్గించాల్సి వుంటుంది. కాని వారసత్వంగా వచ్చిన వ్యయకట్టుబాట్లను బట్టి ఆర్ధిక సంక్షోభ ఫలితంగా కేంద్రం స్వచ్ఛందంగా కార్పొరేట్ రంగానికి, పన్ను రాయితీలను అందించి, దాని ఆర్ధికలోటును నియంత్రించడానికి ఎంచుకున్నట్టే, 2004లో స్వచ్ఛందంగా, పాత పెన్షన్ విధానాన్ని ఉపసంహరణను ఎంచుకుంది.
నయా ఉదారవాదం, ఆర్ధికంగా రాష్ట్రాలు బలహీనపడటం, సంక్షోభానికి కారణమని వాస్తవ పరిస్థితి నుండి దష్టిని మరల్చడానికి పాత పెన్షన్ పథకాన్ని వదిలివేయబడుతున్న సంక్షోభానికి ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం మరియు నయా ఉదారవాదం న్యాయ నిర్ణేతలు నూతన పెన్షన్ పథకంను విజయ వంతమైన పరిష్కారంగా నిర్వచించారు. నూతన పెన్షన్ పథకం కింద 2004 తరువాత ఉద్యోగంలో నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనంలో 10శాతం వాటాను నిధికి విరాళంగా అందిస్తారు. ప్రభుత్వం 14శాతం వాటాను నిధికి సహకారాన్ని అందిస్తుంది. పేరుకుపోయిన మొత్తాలను స్వతంత్ర పెన్షన్ ఫండ్ మేనేజర్లు వారి సేవలకు చెల్లించే నిధులతో పెట్టుబడి పెడతారు, ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు వారు కార్పస్ ఫండ్లో గరిష్టంగా 60శాతం మొత్తాన్ని తీసుకొని మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ స్కీమ్లో పెట్టుబడి పెడతారు. దాని నుండి వచ్చే రాబడి నుండి పెన్షన్ చెల్లిస్తారు. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి, కాని ఇతర ప్రయివేటురంగ యజమానులు వారి ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు.
పెన్షన్ అందించే కార్పస్ ఫండ్ను రూపొందించడంలో ఉద్యోగి, సహకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికే వాటాను అందజేసే, వృత్తిపరమైన ఫండ్ మేనేజరుల ద్వారా ఆ నిధుల నిర్వహణ, ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో తరువాత పొందిన మొత్తాలను సమీకరించింది. కానీ ఫండ్ మేనేజరు ద్వారా కార్పస్ ఫండ్ ఎంత బాగా నిర్వహించబడుతుందనే దానిపై పెన్షన్ చెల్లింపు ఆధారపడి వుంటుంది. 2008 ఆర్ధిక సంక్షోభం సమయంలో అమెరికన్ పెన్షనర్లకు జరిగినట్లుగా మార్కెట్ ఆశించిన రాబడిని అందించక పోవచ్చు లేదా కుప్పకూలడం సంభవించినప్పుడు పొదుపులో ఎక్కువ భాగాన్ని కూడా తుడిచివేయవచ్చు. అంతేకాకుండా, ఎలాంటి ఫలితం వచ్చినా రుసుమును స్వీకరించే ప్రొఫెషనల్ ఫండు మేనేజరు. ఊహించనంత తెలివిగా ఉండక పోవచ్చు. ఈ స్కీము గ్యారంటీ లేనిది. బెనిఫిట్ లేనిది. నిర్వచించబడిన సహకారం లేదు. ఈ నష్టాలు ముఖ్యమైనవి. ఇది పాత పెన్షన్ పథకం కంటే నూతన పెన్షన్ పథకం వలన చాలా తక్కువ ఫలితం ఉంటుంది. అని అనేక ఉదాహరణలను ఉటంకించవచ్చు.
ఉద్యోగులు, కార్మికులు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు చేసే ఉద్యమంతో పాటు కేంద్ర ప్రభుత్వం, వారి అనుకూల మీడియా వారి ఆర్ధికవేత్తలు చేసే తప్పుడు వాదనలో (అనగా పాత పెన్షన్ విధానం అమలు వల్ల ప్రభుత్వాలు అధిక ఆర్ధిక భారాలు మోస్తున్నవి అనే వాదనలు) ఎంత మాత్రం వాస్తవం లేదని ప్రచార యుద్ధాన్ని కూడా జతచేసి పోరాటం నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. అంతేగాక పాత పెన్షన్ పునరుద్ధరణ ఉద్యమంలో ఐక్యతను పటిష్టంగా నిర్మాణం చేసి దేశవ్యాపిత ఐక్య పోరాటాలకు కృషిచేయాలి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో విడివిడిగా జరుగుతున్న పోరాటాలు దేశవ్యాప్త పోరాటాలుగా రూపాంతరం చెందే విధంగా కృషి చేసి విజయం సాధించేవరకూ పోరాడాలి. అదే కార్మికవర్గం ముందున్న ప్రస్తుత, ప్రధాన కర్తవ్యం కావాలి.
ఎస్ఎస్ఆర్ఎ ప్రసాద్
9490300867