హీరో కార్తి నటించిన తన 25వ చిత్రం ‘జపాన్’. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. దీపావళి కానుకగా ఈనెల 10న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్
మీడియాతో ముచ్చటించింది.
– రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్గా ఉంటుంది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ప్రేక్షకురాలిగా కూడా చాలా ఆసక్తిగా ఉన్నాను.
– ట్రైలర్, టీజర్ చూస్తూనే జపాన్ ఒక యూనిక్ సినిమా అని అర్థం అవుతుంది. కార్తి కాదు ఇలాంటి పాత్రని గతంలో ఎవరూ చేయలేదు. ఈ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే చిత్రం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా ఎంజారు చేస్తారు.
– ఇందులో నా పాత్ర ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఉంటుంది. నటిగా కనిపిస్తాను.
నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా ఉంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ ఉంటుంది. జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. థియేటర్లో గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. పాటలు కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఎస్ఆర్ ప్రభు సినిమాపట్ల చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్స్లో ప్రభు ఒకరు.