
– బిఆర్ఎస్ విష ప్రచార నమ్మవద్దు
– ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం
– ఎన్నికల ప్రచారంలో శ్రీధర్ బాబు
నవతెలంగాణ- కాటారం : కాంగ్రెస్ గెలిస్తే మంథని నియోజకవర్గ అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం కాటారం మండలంలోని మర్రిపల్లి, ప్రతాపగిరి, బొప్పారం, దంతలపల్లి, గోపాల్ పూర్, గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన చిన్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని శ్రీధర్ బాబు అభయమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల సహాయంతో పాటు తులం బంగారం అందిస్తామని అన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందించి అండగా ఉంటామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ రాగానే సన్న బియ్యం, అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రైతు భరోసాగా 2 లక్షల రుణమాఫీ, ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఏకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 బోనస్, గృహ జ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉద్యమకారులకు 250 5 లక్షలు, స్థలం, యువ వికాసం క్రింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలోతెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ వృద్ధులకు వితంతులకు 4000 నెలవారీ పింఛన్,10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ప్రతినెల 4 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే చేస్తుందని అన్నారు. రైతులకు మెరుగైన కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కి ఉంది అని, రైతులకు ఉచితంగా విద్యుత్తును కాంగ్రెస్ ప్రభుత్వమే అందించిందనీ అన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెమునురి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ప్రచార కమిటీ కన్వీనర్, కో కన్వీనర్ కుంభం రమేష్ రెడ్డి, నాయిని శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు , ఎంపీటీసీ జాడి మహేశ్వరి, డీసీసీ కార్యదర్శి కుంభం స్వప్న, డాక్టర్ ఎలుబాక సుజాత, డీసీసీ ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డీ, యూత్ అధ్యక్షులు చీమల సందీప్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అమీర్, సర్పంచులు, బాసాని రఘువీర్ ,రఘురాం నాయక్ , ఆంగజాల అశోక్, కొట్టే ప్రభాకర్, రూపేష్, గంట లక్ష్మి, బొడ్డు సులోచన, బౌతు ప్రసన్న తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు