మోడీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం రద్దు అవుతుంది

– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి-నారి ఐలయ్య
నవతెలంగాణ – వలిగొండ రూరల్
మోడీ అధికారంలోకొస్తే ఉపాధి హామీ చట్టం రద్దు చేపడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య తెలిపారు.మండలంలోని గోకారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం పరిశీలించి ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం నిధులు కుదిస్తూ చట్టాన్ని నీరు కార్చే పద్ధతిలో వ్యవరిస్తూ ఉపాధి హామీ చట్టం లేకుండా చేయడం కోసం అనేక మార్పులు చేర్పులు ఉపాధి హామీలో తీసుకురావడం  జరిగిందని, కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించడం మూలంగా ఉపాధి కార్మికులు పనిచేసిన వాటికి పెద్ద ఎత్తున బకాయిలు పేరుకు పోయాయని గత సంవత్సరం తో పాటు ఈ సంవత్సరం పనిచేసిన కార్మికులకు ఆరేడు వారాల బిల్లులు రాకపోవడం మూలంగా కూలీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఈ చట్టం నిలబడాలంటే తిరిగి పార్లమెంట్లో వామపక్ష ఎంపీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని అందుకోసమే వ్యవసాయ కార్మికులంతా భువనగిరి పార్లమెంట్ సిపిఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ కు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. పనిచేసే చోట నీడ, నీరు, ప్రైమరీ చికిత్స కోసం మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీలకు అనుమతిస్తూ 1894 జీవోను తీసుకురావడం అని జరిగింది కానీ పని చేసే చోట ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు కాబట్టి పంచాయతీ కార్యదర్శుల మీద చర్య తీసుకోవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుండి 300 రూపాయలు కూలీనిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కానీ ఎర్రటెండాలో పనిచేస్తున్న కూలీలకు 100,150 కి మించి రావటం లేదని కరువును తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకొని చట్టం వచ్చినటువంటి నేటి వరకు రెగ్యులర్ గా పని చేస్తున్న కార్మికులకు కొలతలు లేకుండా 300 రూపాయల కూలీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, గౌడ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్,నాయకులు నారి రామస్వామి, నారి జంగయ్య,కొమ్ము ముత్తయ్య,శనిగారపు నరిసింహ తదితరులు పాల్గొన్నారు.