నవతెలంగాణ- చివ్వేంల: ఎస్సీ వర్గీకరణకు సహకరించకపోతే రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు చేస్తున్న రిలే నిరాహార దీక్ష లో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 18 నుండి 22 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలలో బిజెపి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేల కాంగ్రెస్ ఎంపి లు పార్లమెంటులో మాట్లాడాలని కోరారు.. ఈ కార్యక్రమంలో చివ్వెంల మండల ఇంచార్జ్ బొడ్డు విజయ్ కుమార్, మండల కన్వీనర్ చెరుకుపల్లి సతీష్, ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు సిరపంగి నాగరాజు , నకరికంటి రవి , ఏర్పుల పృథ్వీరాజ్, బచ్చలి దుర్గ ప్రసాద్, ఏర్పుల మహేందర్ , సిరపంగి సైదులు , అశోక్ , బచ్చలి నాగయ్య , బచ్చలి వంశీ, రామ్ తదితరులు పాల్గొన్నారు..